ఆంధ్ర కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా..
ఆంధ్రాలో ఎన్నికలు మరొక వారం రోజులలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కొత్త డీజీపీని ఎన్నికల కమిషన్ నియమించింది. 1992 బ్యాచ్ కు చెందినటువంటి హరీష్ కుమార్ గుప్తాను ఆంధ్ర రాష్ట్రానికి కొత్త డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ సెక్రటరీగా వ్యవహరిస్తున్న హరీష్ కుమార్ గుప్తా నేటి నుంచి ఆంధ్రకు కొత్త డీజీపీగా పదవి బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆంధ్ర డీజీపీగా కొనసాగిన రాజేంద్రనాథ్ రెడ్డిపై అనూహ్యంగా ఆదివారం బదలి వేటు పడింది.
Tags :