డీఎంకే ఎంపీ కనిమెళి కి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఎంతో మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా డీఎంకే ఎంపీ కనిమెళి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఎంపీ అధికారికంగా ప్రకటించారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కనిమొళి ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగానే కనిమొళికి కరోనా వ్యాపించి ఉండొచ్చని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కరోనా సోకడంతో ప్రచారాలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్లో ఉన్నారని సమాచారం.
Tags :