బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన మండలి చైర్మన్ గుత్తా కుమారుడు
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్వి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో అమిత్ రెడ్డి కలిశారు.
Tags :