ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాపిల్.. మే 27 నుంచి
టెక్ దిగ్గజం యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మే 27 నుంచి తొలగింపు వర్తిస్తుందంటూ మార్చి 28న 614 మంది వర్కర్లకు పంపిన లేఖలో యాపిల్ పేర్కొంది. ఈ ఉద్యోగులంతా శాంటా క్లారాలోని ఎనిమిది కార్యాలయాల్లో పని చేస్తున్నారు. కొవిడ్-19 తర్వాత యాపిల్ ఇంత భారీ స్థాయిలో ఉద్వాసనలకు తెరతీయడం ఇదే ప్రథమం. కోవిడ్ సమయంలో భారీగా రిక్రూట్మెంట్ చేపట్టిన చాలామటుకు టెక్ కంపెనీలు గత రెండేళ్లుగా పెద్ద యెత్తున ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.
Tags :