ఏపీలో కరోనా విజృంభణ...
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,260 పరీక్షలు నిర్వహించగా 1,398 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,234కి చేరింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,05,946 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 787 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,89,295కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,417 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,51,77,364 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 273, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.
Tags :