ASBL NSL Infratech

ఏపీ అసెంబ్లీకి 2,387 మంది.. లోక్ సభకు 454 మంది

ఏపీ అసెంబ్లీకి 2,387 మంది.. లోక్ సభకు 454 మంది

సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో 2,387 మంది, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 454 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుండగా, సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 318 మంది, లోక్‌సభ స్థానాల్లో 49 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి అత్యధికంగా 10, బాపట్ల శాసనసభకు 11 మంది నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులను రాష్ట్ర ఎన్నికల అధికారి ( సీఈవో) ఎంకే మీనా ప్రకటించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :