బాలీవుడ్ హీరోకు కరోనా పాజిటివ్
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారిన పడడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబైలోని హిరానందాని ఆస్పత్రిలో చేరానని ఆయన తెలియజేశారు. నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు, మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞడిని. నేను ఆరోగ్యంగానే ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాను. అతి త్వరలో క్షేమంగా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు అక్షయ్. ఆయన నటించిన లక్ష్మీ మూవీ షూటింగ్ సమయంలో అక్షయ్కి మొదటిసారి కరోనా సోకింది. హోంక్వారంటైన్లో ఉన్నట్లు చెప్పిన అక్షయ్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్సేతు మూవీ షూటింగ్లో పాల్గొన్న అక్షయ్ ఈ క్రమంలో కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది.