ఏపీలో కొత్తగా 1,326 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 30,678 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా లెక్కలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,244కి చేరింది. ఒక్కరోజులో 911 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,39,114 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.