సంచలనం కోసమే జగన్ పై దాడి
విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబరు 25న ఏపీ ప్రతిపక్షనేత జగన్పై జరిగిన దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేశ్చంద్రా లడ్డా సృష్టం చేశారు. పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్ వెల్డర్గా, కేక్ మాస్టర్గా, కుక్గా పలు చోట్ల పనిచేశాడని తెలిపారు. అతను సంచలనం కోసమే జగన్పై దాడి చేశాడు తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదని తెలిపారు.
వాస్తవానికి గతేడాది అక్టోబర్ 18నే డాడి చేయాలని శ్రీనివాస్ ప్రణాళిక రూపొందించినప్పటికి అది సాధ్యం కాలేదని తెలిపారు. దాడి జరిగిన రోజున నిందితుడు శ్రీనివాస్ కోడికత్తికి సాన పట్టించాడని, దీన్ని అతడి సహచరులు కూడా చూశారని చెప్పారు. దాడి జరిగిన రోజు పక్కా ప్రణాళికతో ఇంటి నుంచి శ్రీనివాస్ ఉదయం 4:55 గంటలకే బయల్దేరాడని చెప్పారు.