పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన
విభజన హామీలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారని ఎంపీ అశోక్గజపతిరాజు మండిపడ్డారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన సృష్టం చేశారు.
Tags :