సీఎం చంద్రబాబును కలిసిన సబ్బం హరి!
మాజీ ఎంపీ సబ్బం హరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినట్టు తెలిసింది. నూతన సంవత్సరం తొలిరోజున ఆయన ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. సబ్బంహరి గతంలో విశాఖపట్నం మేయర్గా, అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీలోనూ లేకుండా రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. అయితే, ఎన్నికల నాటికి తాను ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతానని ఆయన ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశమైంది.
Tags :