'పేట' తెలుగు ట్రైలర్ విడుదల
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్, త్రిష ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం పేట. జవనరి 10న విడుదల కానున్న ఈ చిత్రం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇటీవల చిత్ర టైలర్ తమిళ వర్షెన్లో విడుదల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత న్యూ ఇయర్ విషెస్ చెబుతూ స్నేక్ పీక్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తెలుగు వర్షెన్కి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. రజినీ ఇమేజ్ కు తగ్గట్లుగా ట్రైలర్ కట్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే రజనీ స్టైలిష్ మేనరిజం ను ఈ చిత్రంలో పూర్తిగా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ చిత్రం లో సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ, శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. చిత్రంలో రజనీకాంత్ కళాశాల వార్డెన్గా, ఫ్లాష్బ్యాక్లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందించనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని విడుదల చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదల కానుంది.