ASBL NSL Infratech

కుటుంబం కోసం కాదు... ప్రజల కోసమే

కుటుంబం కోసం కాదు... ప్రజల కోసమే

కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఎన్టీఆర్‌ గృహాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 63 శాతం పూర్తైందని, కేంద్రంతో పోరాడైనా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్నారు. రాష్ట్ర అవతరణ జరుపుకోలేని ఏకైక రాష్ట్రం ఆంధ్రనే అంటూ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వలో ఆర్థిక వ్వవస్థ కుదేలైందని, బ్యాంకులు దివాళాతీశాయని, యుద్ధ విమానాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మండిపడ్డారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని, మహిళలు శక్తి, సామర్థ్యాలు కుటుంబానికి ఉపయోగించాలన్నారు

అదే విధంగా జగన్‌పై స్పందిస్తూ తప్పుడు లెక్కలు రాయడం తప్ప జగన్‌కు ఏమీ తెలియదన్నారు. కేంద్రం తలచుకుంటే జగన్‌పై కేసులు తిరగదోడుతుందని, కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్‌ కేంద్రానికి లొంగిపోయారన్నారు. కానీ, టీడీపీ ఎన్నటికీ అలాంటి బెదిరింపులకు లొంగదన్నారు. ప్రజలు సహకరిస్తే 2029 నాటికి రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌ చేస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కుటుంబం కోసం తాను కష్టపడడం లేదని, 24 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నానంటూ చంద్రబాబు చెపుకొచ్చారు.

Click here for Photogallery

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :