త్వరలో పెళ్లిపీటలెక్కనున్న అమీ జాక్సన్
సినీ నటి అమీ జాక్సన్ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటో, అమీ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. న్యూఇయర్ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 1 జనవరి 2019 మన జీవితాల్లో కొత్త ప్రయాణం. ఐ లవ్యూ. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు అని పేర్కొంటూ ఫొటోను పోస్ట్ చేశారు. అయితే పెళ్లెప్పుడన్న విషయాన్ని మాత్రం అమీ వెల్లడించలేదు. తెలుగులో ఎవడు, అభినేత్రి చిత్రాల్లో నటించారు అమీ. ఇటీవల విడుదలైన 2.ఓ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె సూపర్స్టార్ రజనీకాంత్కు జోడీగా రోబో పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
Tags :