Donald Trump: అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారు? : ట్రంప్ సూటి ప్రశ్న

అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా పలువురు టెక్ దిగ్గజాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విందు ఇచ్చారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలు హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ అనంతరం ఈ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టిమ్కుక్, సుందర్ పిచారు, మార్క్ జుకర్బర్గ్, సత్యనాదెళ్ల (Satyanadella) వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు.
అమెరికాలో టెక్ కంపెనీల పెట్టుబడుల గురించి వాటి అధిపతులు, సీఈఓలను ట్రంప్ ప్రశ్నించారు. ఎవరు ఎంత పెట్టుబడులుప పెట్టనున్నారో ఆరా తీశారు. ట్రంప్ ప్రశ్నలకు పలువురు టెక్ సీఈఓలు బదులిచ్చారు. టిమ్ అమెరికాలో యాపిల్ ఎంత పెట్టుబడులు పెట్టనుంది. అది చాలా పెద్ద మొత్తమే అయి ఉంటుందని నాకు తెలుసు. ఇన్నాళ్లూ మీరు బయట (ఇతర దేశాల్లో) పెట్టుబడులు పెట్టింది చాలు. ఇక స్వదేశానికి తిరిగిరండి. ఎంత పెట్టుబడి పెడతారు? అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ను ట్రంప్ అడిగారు. దీనికి టిమ్ బదులిస్తూ 600 బిలియన్ డాలర్లు అని చెప్పారు. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) 600 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. రాబోయే రెండేండ్లలో 250 బిలియన్ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచారు తెలిపారు. ఏటా 80 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బదులిచ్చారు. టెక్ దిగ్గజాల సమాధానాలకు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడులు చాలా పెద్ద మొత్తమనీ, వీటితో పెద్ద ఎత్తున ఉద్యోగలు సృష్టించొచ్చని వారిని అమెరికా అధ్యక్షుడు అభినందించారు.