మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు.. షాక్ ఇచ్చిన హైకోర్టు

గన్మెన్లు కావాలన్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, 4G4 భద్రత కల్పించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ప్రతి ఒక్కరికి భద్రత కేటాయించడం సాధ్యం కాదన్న ధర్మాసనం, శ్రీనివాస్ గౌడ్కు గన్మెన్లు అవసరమా? లేదా? అనే విషయాన్ని తెలియజేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.