ఒక వైపు సంక్షేమానికి కోతలు.. మరో వైపు వాతలా? : హరీశ్ రావు

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హనుమకొండలో ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్స ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. అందుకోసం అసెంబ్లీ, కౌన్సిల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి పోరాడతాం. నారాయణఖేడ్లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నిరుద్యోగ భృతి హామీపై నిలదీస్తే, అలా చెప్పలేదని అసెంబ్లీలో భట్టి విక్రమార్క అంటున్నారు. కరెంటు బిల్లులు, భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికి సిద్ధమవుతున్నారు. ఒక వైపు సంక్షేమానికి కోతలు, మరోవైపు వాతలా? అన్ని వర్గాలను మోసం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెబితే కాంగ్రెస్ దారికొస్తుంది అని అన్నారు.