ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? : మల్లు రవి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదివారని ప్రచారం చేస్తున్న నాయకులు ఆ కళాశాలలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ కళాశాల వారే పట్టభద్రులు, మిగిలిన వారు కాదన్నట్లుగా మాట్లాడటం సరి కాదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ కేసీఆర్చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పట్టభద్రులపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో వారి మాటల్లోనే తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న పోటీకి అర్హుడని ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. కాబట్టి కేటీఆర్ తన మాటలను ఉపసంహరించుకోవాలి. ఆ వ్యాఖ్యలను ఎలక్షన్ కమిష్ దృష్టికి తీసుకెళ్తాం. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ వస్తున్నారు. ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు.
తెలంగాణ సాధన కోసం పని చేసిన అన్ని పార్టీలను వేడుకలకు ఆహ్వానిస్తున్నాం. 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గురించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆ పార్టీలన్నీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయి. మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచాక కాంగ్రెస్ భావజాలాన్ని సమర్థవంతంగా ప్రజల్లో తీసుకెళ్తారు. శాసన మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగులు, మహిళల గురించి తన గొంతు వినిపిస్తారు అని తెలిపారు.