గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం : సీఎం రేవంత్

ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని, ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని సికింద్రాబాద్లోని మహాబోధి బుద్ధ విహార్ను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ నేను పని చేసేటప్పుడు ధాన్యంగా ఉంటా. సమాజంలో అశాంతి, అసూయలను అధిగమించాల్సిన బాధ్యత అందరిది. మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలి. సమాజానికి మేలు చేయాలన్న తలంపును ఇతరులకు పంచాలి. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం. మహాబోధి బుద్ధ విహార్కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తాం. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్ ముగిశాఖ నిధులు మంజూరు చేస్తాం అని తెలిపారు.