Konda Vishweshwar Reddy:ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వినూత్న నిరసన
తెలంగాణలో బీజేపీ వ్యవహారంపై ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ (Chandrashekhar Tiwari ) కి కానుకగా ఫుట్బాల్ (Football) ఇచ్చి నిరసన తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తివారీని కలిస్తే, రామచందర్ రావు (Ramachandra Rao )ను కలవమంటున్నారు. రామచందర్రావును కలిస్తే, అభయ్ పాటిల్ (Abhay Patil) ను కలవమంటున్నారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.







