Tirumala : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణానికి కమిటీ : బీఆర్ నాయుడు
ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణకు రూ.4.35 కోట్లు కేటాయిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు (EO Shyamala Rao) మీడియాకు వెల్లడిరచారు. ఆగస్టు నుంచి అక్కడ మూడు పూటలా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Q Complex) -3 నిర్మించేందుకు, దీనిపై సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుమల (Tirumala )లో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మించాలని నిర్ణయించామన్నారు.







