Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Jagans silence at crucial times growing dissatisfaction within the party ranks

Jagan: కీలక సమయాల్లో జగన్ మౌనం.. పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి..

  • Published By: techteam
  • September 7, 2025 / 05:00 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Jagans Silence At Crucial Times Growing Dissatisfaction Within The Party Ranks

‘జగన్ (Jagan) అంటే జనమే, జనమే అంటే జగన్’ అని ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) శ్రేణుల్లో గర్జించిన నినాదం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కాలక్రమంలో పార్టీ శైలి, కార్యక్రమాల తీరు బాగా తగ్గిపోవడంతో, ఇప్పుడు అరుదుగా చేసే కార్యక్రమాల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కనిపించడం మానేశారు. తాడేపల్లి (Tadepalli) కార్యాలయంలో నిశ్శబ్దంగా ఉండే ఆయనను, పార్టీ నేతలు రోడ్లపైకి రావాలని కోరుతున్నారు. ఫలితంగా పార్టీ ప్రోగ్రామ్‌లు మొక్కుబడి స్థాయిలో, ఫోటో సెషన్‌లతోనే ముగిసిపోతున్నాయి. నేతలు కొద్దిసేపు వచ్చి మీడియాకు మాట్లాడి, ఫొటోలకు పోజులు ఇచ్చి వెళ్లిపోతే కార్యక్రమం ముగిసినట్టే.

Telugu Times Custom Ads

ఇటీవల ‘అన్నదాత పోరు’ (Anadatha Poru) పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక నిరసనకు పిలుపునిచ్చింది. ఈనెల 9వ తేదీ మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ఎత్తిచూపుతూ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. యూరియా కొరత, రైతుల కష్టాలు ప్రధాన అంశాలుగా నిరసనకు రూపకల్పన చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకారు అని ముందే చెప్పేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడుతూ, “ఇది మనందరం కలిసే ముందుకు తీసుకెళ్ళాల్సిన కార్యక్రమం. జగన్ గారు వేరే పనిలో పాల్గొంటారు. ఇది ముందుగానే నిర్ణయించుకున్నది కాబట్టి మనమే విజయవంతం చేయాలి” అని సూచించారు.

మంగళవారం రోజున ప్రతి ఆర్డీవో కార్యాలయం ముందు పార్టీ నాయకులు రైతులతో కలిసి ధర్నాలు చేసి, ప్లకార్డులు ప్రదర్శించనున్నారు. కానీ ఎక్కడా గొడవలు జరగకుండా శాంతియుతంగా కొనసాగించాలని సజ్జల ప్రత్యేకంగా సూచించారు. ఈ నిరసన పోస్టర్‌ను కూడా ఆయనే ఆవిష్కరించారు. సాధారణంగా రాష్ట్ర స్థాయి పెద్ద సమస్యలపై ముందుండాల్సిన జగన్ గారు ఈసారి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యమనే చెప్పాలి.

ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇతర పథకాలపై కూడా పార్టీ నిరసనలు చేపట్టింది. కానీ వాటిలోనూ జగన్ లేనందువల్ల పెద్దగా ఫలితం రాలేదు. చాలా జిల్లాల్లో కార్యకర్తలు “జగన్ లేకుండా మాకు రావడం సాధ్యం కాదు” అంటూ తేల్చేశారు. ఆ తర్వాత నాయకులు వారిని బతిమాలి, బలవంతంగా ఫోటోలకు తీసుకురావాల్సి వచ్చింది. ఫలితంగా ఆ కార్యక్రమాలు పేరుకే జరిగాయి, కానీ ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల సమస్యలపై బలమైన ఆందోళన అవసరం ఉన్న సమయంలో కూడా జగన్ “ముందు మీరు, తరువాత నేను” అన్నట్టుగా పక్కకు తప్పుకోవడం పార్టీ శ్రేణుల్లో అసహనానికి కారణమవుతోంది. ప్రజలే తన బలం అని చెప్పుకున్న నాయకుడు, ఇప్పుడు కీలక సమయాల్లో ఎందుకు మౌనంగా ఉంటున్నారని అనుచరులు ప్రశ్నించుకోవడం ప్రారంభించారు. పార్టీ ప్రోగ్రామ్‌లు వాస్తవ సమస్యల కంటే ఫోటోలకు పరిమితమవుతుండటంతో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

 

 

 

Tags
  • AP Politics
  • tdp
  • ycp
  • YS Jagan

Related News

  • Ambati Rambabu Counter On Pulivendula By Election

    Ambati Rambabu: పులివెందుల ఉపఎన్నికలపై అంబటి కౌంటర్..

  • Ysrcp To Picket Rdos On Sept 9

    Jagan: డిలే అవుతున్న జగన్ వ్యూహాలు..సొంత పార్టీ నుంచే విమర్శలు..

  • Police Notice To Kethireddy Pedda Reddy

    Tadipatri: పెద్దారెడ్డికి 24 గంటల్లోనే పోలీస్ నోటీసులు.. తాడిపత్రిలో హై టెన్షన్..

  • Bail Granted In Ap Liquor Scam Case

    AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్టులే ట్విస్టులు..!

  • Jagan Is Okay But What About Balayya

    Bala Krishna: జగన్ సంగతి సరే మరి బాలయ్య పరిస్థితి ఏమిటి?

  • Bail Granted To Four Accused In Ap Liquor Case

    AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్‌కి గ్రీన్ సిగ్నల్..

Latest News
  • Mirai: ‘మిరాయ్’ సినిమా తప్పకుండా ప్రేక్షకులని అలరిస్తుందనే నమ్మకం వుంది- ధ్రువా సర్జా
  • Nara Lokesh: కర్ణాటకలోని శ్రీ ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
  • Ambati Rambabu: పులివెందుల ఉపఎన్నికలపై అంబటి కౌంటర్..
  • Jagan: డిలే అవుతున్న జగన్ వ్యూహాలు..సొంత పార్టీ నుంచే విమర్శలు..
  • Tadipatri: పెద్దారెడ్డికి 24 గంటల్లోనే పోలీస్ నోటీసులు.. తాడిపత్రిలో హై టెన్షన్..
  • Jagan: కీలక సమయాల్లో జగన్ మౌనం.. పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి..
  • AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్టులే ట్విస్టులు..!
  • Vijayawada Utsav: వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ “విజయవాడ ఉత్సవ్” కర్టెన్ రైజర్ ఈవెంట్
  • Bala Krishna: జగన్ సంగతి సరే మరి బాలయ్య పరిస్థితి ఏమిటి?
  • #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer