TTD: టీటీడీకు విద్యుత్ బస్సు విరాళం… ధర ఎంతో తెలుసా?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఎలక్ట్రిక్ బస్సు విరాళం అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్ మణి (Ganesh Mani) , చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరమణ్ (Venkataraman) రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్ బస్సును టీటీడీ (TTD) కి అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury) కి అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామక్రిష్ట, తిరుమల డీఐ వెంకటాద్రి నాయుడు (Venkatadri Naidu) పాల్గొన్నారు.