Chandrababu: ఆగస్టు 15 నుంచి సమర్థంగా ఈ పథకం అమలు : సీఎం చంద్రబాబు
మహిళలకు ఆర్టీసీ బస్సు (RTC bus) ల్లో ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఉచిత ప్రయాణ పథకంలో జీరో ఫేర్ టికెట్ (Zero Fare Ticket) జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, టికెక్ ధర ఎంత, ప్రభుత్వం 100 శాతం ఇస్తున్న రాయితీ, వంటి వివరాలన్నీ అందులో ఉండాలని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై సీఎం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జీరో ఫేర్ టిక్కెట్ ద్వారా ఎంత లబ్ధి పొందారనేది మహిళలకు సులభంగా తెలుస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ (Software) లో మార్పులు చేయాలని ఆదేశించారు. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ఎంత భారం పడిరది. మన రాష్ట్రంలో ఎంత వ్యయం అవుతుందనే వివరాలపై అధికారులతో చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు (August) 15 నుంచి సమర్థంగా ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారు.







