Chandrababu: ఇప్పటి వరకూ రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి : చంద్రబాబు
విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు (CII Summit)లో ఇప్పటి వరకూ రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. శ్రీసిటీ (Sricity)లో మరికొన్ని యూనిట్లను సీఎం వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. గడిచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు.
ఒక ప్రణాళికతో శ్రీసిటీని ఏర్పాటు చేశాం. అభివృద్ధికి ఇది చక్కటి ఉదాహరణగా నిలిచింది. శ్రీసిటి నుంచే డైకిన్, ఇసుజా, క్యాడ్బరీ (Cadbury) ప్రపంచానికి ఉత్పత్తులు అందిస్తున్నాయి. వివిధ దేశాల పరిశ్రమలు శ్రీసిటీ పారిశ్రామిక టౌన్షిన్నకు రావాలి. త్వరలోనే శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తాం. 50 దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడి నుంచే పనిచేస్తాయి. త్వరలోనే 1.5 లక్షల ఉద్యోగాలతో శ్రీసిటి అభివృద్ధి మోడల్గా మారుతుంది. 2028 నాటికి దీనిని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తాం. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు భారీ ప్రణాళికలు వేస్తున్నాం అని అన్నారు.






