Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Chandrababu announce toli adugu vijaya yatra programme from june 23

Chandrababu: కేడర్‌కు పెద్ద పని పెట్టిన చంద్రబాబు.. 23 నుంచి నెలరోజులు జనంలోనే..!!

  • Published By: techteam
  • June 14, 2025 / 04:14 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Chandrababu Announce Toli Adugu Vijaya Yatra Programme From June 23

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్‌ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం (NDA Govt) ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను వివరించాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడి నుంచి కార్యకర్త వరకు అందరూ పాల్గొని, ప్రచారంలో పోటీపడి పనిచేయాలని ఆయన ఆదేశించారు.

Telugu Times Custom Ads

మహానాడు విజయవంతమైనప్పటికీ, సేద తీరకుండా పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేయాలని సీఎం సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమిటీల్లో స్థానం ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబ సాధికార సారధిలో ఉంటేనే పదవులు వస్తాయి. కార్యకర్తలు ఎల్లప్పుడూ డైనమిక్‌గా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. జూలై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిరోజూ పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయించి, ప్రజలతో కలిసిమెలసి ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ‘యోగాంధ్ర’ (Yogandhra) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనే లక్ష్యంతో ఇప్పటికే 2.21 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు రోజులు యోగాలో పాల్గొనేవారికి సర్టిఫికేట్ ఇస్తామని, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. “హెల్తీ, వెల్దీ, హ్యాపీ సమాజం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలిపే ఉద్యమం” అని ఆయన అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసినట్లు సీఎం తెలిపారు. 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10 వేల కోట్లు విడుదల చేశామని, తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు, పాఠశాలల అభివృద్ధికి రూ.2 వేలు కేటాయించామని వివరించారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయగా, కూటమి ప్రభుత్వం 25 లక్షల మంది అదనంగా లబ్ధి పొందేలా చేసిందని… రూ.8,747 కోట్లు ఖర్చు చేస్తూ గత ప్రభుత్వం కంటే రూ.3,205 కోట్లు అదనంగా వెచ్చిస్తున్నామని చెప్పారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద ఏడాదికి రూ.34 వేల కోట్లు, అన్నాక్యాంటీన్ల ద్వారా 4 కోట్ల భోజనాలు సరఫరా చేసినట్లు సీఎం తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఈ నెల 20న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వం విచ్చలవిడి అప్పులు ఉన్నప్పటికీ, సూపర్-6, మేనిఫెస్టో హామీలను ఏడాదిలోపే అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సూపర్-6, బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ హామీలను అమలు చేస్తున్న వైనాన్ని వివరించాలని సీఎం కోరారు. ఏడాది పాలన పూర్తైన సందర్భంగా నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

Tags
  • AP Politics
  • Chandrababu
  • Nara Lokesh
  • tdp
  • Toli Adugu Vijaya Yatra

Related News

  • Balakrishna Comments On Ys Jagan And Chiranjeevi

    AP Assembly: సభా గౌరవం పేరు మీద రాజకీయాలు.. ప్రజల్లో పెరుగుతున్న సందేహాలు..

  • Botsa Satyanarayana Comments On Balakrishna

    Botsa Satyanarayana: అసెంబ్లీ లో బాలయ్య ప్రవర్తన పై బొత్సా అసహనం..

  • Minister Nara Lokesh Launches Official Website For Visakha Partnership Summit

    Nara Lokesh: భాగస్వామ్య సదస్సు-2025 అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

  • Europe Is Readying For Direct Conflict With Russia

    Russia: రష్యా వర్సెస్ నాటో.. మీ ఫైటర్స్ జెట్స్ వస్తే కూల్చేసామని క్రెమ్లిన్ కు హెచ్చరిక

  • Us Versities Effect On H1b Visa Fee Hike

    US: అమెరికా వర్సిటీలపై హెచ్ 1బీ పెంపు ఎఫెక్ట్..!

  • Sonam Wangchuk Arrested Days After Violent Ladakh Protests Killed 4

    Sonam Wangchuk: లద్దాఖ్ రణరంగం..సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్..

Latest News
  • AP Assembly: సభా గౌరవం పేరు మీద రాజకీయాలు.. ప్రజల్లో పెరుగుతున్న సందేహాలు..
  • Botsa Satyanarayana: అసెంబ్లీ లో బాలయ్య ప్రవర్తన పై బొత్సా అసహనం..
  • DGP : తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి
  • National: తెలుగు వారికి జాతీయ భూవిజ్ఞాన శాస్త్ర పురస్కారాలు
  • America: 2417 మంది అమెరికా నుంచి భారత్‌కు : విదేశాంగ శాఖ
  • Shahbaz Sharif: అమెరికా అధ్యక్షుడిపై పాక్‌  ప్రధాని షెహబాజ్‌ ప్రశంసలు
  • India:భారత్‌, అమెరికా నిర్ణయం…వీలైనంత త్వరగా
  • Shriya Saran: పూల్ లో శ్రియ బికినీ అందాలు
  • ATA: ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా చారిత్రక ఒప్పందం
  • Nara Lokesh: భాగస్వామ్య సదస్సు-2025 అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer