ఏపీలో షెడ్యూల్ ప్రకారమే… టెన్త్ పరీక్షలు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.