Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Ys jagaan at at yelahanka palace

Jagan: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మళ్లీ యలహంకకి చేరిన జగన్..

  • Published By: techteam
  • September 20, 2025 / 04:30 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Ys Jagaan At At Yelahanka Palace

వైసీపీ (వైసీపీ) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇటీవల తన రాజకీయ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎక్కువ సమయం బెంగళూరు (Bengaluru) లోని యలహంక (Yelahanka) ప్యాలెస్ లోనే గడుపుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి సభకు దూరంగా ఉండటం పై తెలుగు దేశం పార్టీ (TDP) విమర్శలు గుప్పిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతోనే సభకు రాకుండా ఉన్నారని ఆయన స్పష్టం చేసినా, ఇది సరైన పద్ధతి కాదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

Telugu Times Custom Ads

జగన్ తన రాజకీయ జీవితం ప్రారంభం కావడానికి ముందు నుంచే బెంగళూరుతో అనుబంధం ఉన్నది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y. S. Rajasekhara Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే యలహంకలో అద్భుతమైన భవనం నిర్మించారు. తరువాత హైదరాబాద్ (Hyderabad) లోని లోటస్ పాండ్ (Lotus Pond) లో కూడా ఓ విలాసవంతమైన నివాసాన్ని కట్టుకున్నారు. 2014 లో రాష్ట్ర విభజన వరకు ఆయన ఎక్కువగా హైదరాబాద్ నుంచే రాజకీయ కార్యకలాపాలు నడిపారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లి (Tadepalli) లో ఇల్లు నిర్మించి, అక్కడే తన రాజకీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అయితే ఈసారి ఎన్నికల్లో ఎదురైన పెద్ద దెబ్బ తర్వాత జగన్ తరచూ తాడేపల్లిలో కాకుండా బెంగళూరులోనే ఉంటున్నారని సమాచారం. నెలలో కొన్నిసార్లు మాత్రమే తాడేపల్లికి వచ్చి, రెండు రోజులు ఉండి మళ్లీ బెంగళూరుకి వెళ్లిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన రాష్ట్రానికి వచ్చి మీడియాతో మాట్లాడతానని ముందే ప్రకటించారు. సభలో ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల తనకు తగిన అవకాశాలు ఇవ్వరని, అందుకే మీడియా ద్వారానే ప్రజాసమస్యలను ప్రస్తావిస్తానని తెలిపారు.

ఈ నెల 18న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ తాడేపల్లికి వచ్చి పార్టీ ఎల్పీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా తాను ప్రతిపక్ష నేతగా గుర్తింపు వస్తేనే సభకు హాజరవుతానని మరోసారి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేయకపోవడంతో, రెండు రోజులుగా జరుగుతున్న సమావేశాలకు ఆయన హాజరుకాలేదు. శనివారం, ఆదివారం సభకు విరామం ఉండడంతో, జగన్ మళ్లీ బెంగళూరుకి వెళ్లిపోయారు.

టీడీపీ వర్గాలు ఈ విషయం పై మరింత విమర్శలు చేస్తూ, సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత జగన్ 51వ సారి బెంగళూరు వెళ్లారని లెక్కలు కూడా చెబుతున్నాయి. ఆయన ఎప్పుడు తాడేపల్లిలో ఉంటారు, ఎప్పుడు విమానంలో బెంగళూరు చేరతారు అన్నది కూడా రాజకీయ చర్చలకు కారణమవుతోంది. భవిష్యత్తులో జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే గడిపే అవకాశం ఉందని, ఆయన రాజకీయ శైలి కూడా అలా మారుతుందని..కానీ ఇది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు.

 

 

 

Tags
  • AP Assembly
  • AP Politics
  • ycp
  • YS Jagan

Related News

  • Bhanu Prakash Reddy Press Meet About Parakamani Theft

    TTD: తిరుమల పరకామణిలో దొంగతనం… భాను ప్రకాష్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్..!

  • Rega Matsyalingam Clarity On Leave Ycp

    YCP: వైసీపీని వీడే ప్రచారంపై ఎమ్మెల్యే మత్స్యలింగం క్లారిటీ..

  • Chandrababu Fires On Ycp In Macharla

    Chandrababu: మాచర్లలో వైసీపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు..

  • Mp Chinni On Vijayawada Vutsav

    MP Keshineni : యథావిధిగా విజయవాడ  ఉత్సవ్‌ : ఎంపీ కేశినేని శివనాథ్‌

  • Bonda Uma Vs Pawan Kalyan In Ap Assembly

    Bonda Vs Pawan : పవన్‌పై బొండా ఉమ బురద జల్లుతున్నారా..?

  • Cm Chandrababu Macherla Visit

    Chandrababu: పారిశుద్ధ్య  కార్మికులతో కలిసి చెత్త ఊడ్చిన చంద్రబాబు

Latest News
  • TTD: తిరుమల పరకామణిలో దొంగతనం… భాను ప్రకాష్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్..!
  • YCP: వైసీపీని వీడే ప్రచారంపై ఎమ్మెల్యే మత్స్యలింగం క్లారిటీ..
  • Banks: పెద్దోళ్లకు ఒక న్యాయం… పేదోళ్లకు మరో న్యాయం…!!
  • Jagan: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మళ్లీ యలహంకకి చేరిన జగన్..
  • Chandrababu: మాచర్లలో వైసీపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు..
  • Shiva 4K: అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ‘శివ’ 4K డాల్బీ ఆట్మాస్ రీ-రిలీజ్
  • Randhir Jaiswal : వారి ట్రాప్‌లో పడొద్దు …అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం వార్నింగ్‌
  • Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం : భట్టి
  • Minister Seethakka: సీఎం రేవంత్‌ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు : మంత్రి సీతక్క
  • MP Keshineni : యథావిధిగా విజయవాడ  ఉత్సవ్‌ : ఎంపీ కేశినేని శివనాథ్‌
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer