భారత కుబేరుడు అంబానీయే.. వరుసగా పదో ఏడాదీ
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆసియా సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు రూ.1,40,200 కోట్ల నుంచి రూ.5,05,900 కోట్లకు అంటే నాలుగు రెట్లు పెరిగాయి. ఐఐఎఫ్ ఎల్ వెల్త్ హురూన్ ఇండియా జాబితా 2021 ను విడుదల చేశారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన ఆస్తువ విలువ రూ.7,18,00 కోట్లు ఉంది. అంబానీ టాప్ సంపన్న భారతీయుడి ర్యాంక్ను వరుసగా ఐదోసారి దక్కించుకున్నారు. ఆసియా రెండో సంపన్నుడిగా ఉన్న చైనాకు చెందిన వాటర్ ఉత్పత్తిదారుడు జాంగ్ షన్షాన్ను గౌతమ్ అదానీ అధిగమించారు. గత సంవత్సరంలో అదానీ ప్రతిరోజూ రూ.1,002 కోట్లు సంపాదించారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు రూ.5.05 లక్షల కోట్లు, అయితే ఏడాది క్రితం అదానీ ఆస్తులు రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే.






