ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ గవర్నర్

జార్ఖండ్ రాజధాని రాంచీలో తెలంగాణ ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ క్యూలైన్లో వచ్చి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇవాళ తాను ఓటు వేసి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నాను. ప్రతి పౌరుడు కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు వేయడం ఒక హక్కు మాత్రమే కాదు, దేశానికి ప్రజాస్వామ్య కర్తవ్యం కూడా అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.