ఎస్బీఐ గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది వరకు పొడిగింపు
దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ఎస్బీఐ వీ కేర్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. సీనియర్ సిటిజన్ల కోసం 2020 మేలో ఎస్బీఐ ఈ టర్మ్ డిపాజిట్ స్కీమ్ను ప్రారంభించింది. తొలుత 2020 సెప్టెంబరు వరకు మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపినప్పటికీ కొవిడ్`19 కారంగా ఈ పథకం గడువును పలుమార్లు పొడిగించుకంటూ వచ్చింది. తాజాగా 2023 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.






