జియో గుడ్ న్యూస్.. 5జీ సర్వీసులను
టెలికం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. రిలయన్స్ జియో సంస్థ 5 సర్వీసులను లాంఛనంగా ప్రారంభించింది. రాజస్థాన్ రాష్ట్రం రాజ్సమంద్లోని ప్రతిష్ఠాత్మక శ్రీనాథ్జీ ఆలయంలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోల్కతా, ముంబై, ఢిల్లీ , చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ఈ ఏడాది పూర్తయ్యే లోపల అందుబాటులో తీసుకురావడమే రిలయన్స జియో కంపెనీ లక్ష్యం అన్నారు. 2023 డిసెంబర్ నాటి దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను అందించడమే తమ ఉద్దేశమని ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.






