15 నిమిషాలు.. ఒకే వ్యక్తి.. రెండుసార్లు మంత్రిగా ప్రమాణం!

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో జరిగిన ఓ చిన్నతప్పిదం కారణంగా రామ్నివాస్ రావత్ రెండుసార్లు మంత్రిగా ప్రమాణం చేయాల్సి వచ్చింది. ఇదంతా నిమిషాల వ్యవధిలో చోటుచేసుకోవడం గమనార్హం.
రామ్నివాస్ రావత్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి షియోపుర్ జిల్లాలోని విజయ్పుర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన బీజేపీలో చేరారు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. నేటి ఉదయం రావత్తో గవర్నర్ మంగుభాయ్ సీ పటేల్ మంత్రిగా ప్రమాణం చేయించారు. ఆ సమయంలో రావత్ రాజ్య మంత్రి (రాష్ట్ర మంత్రి)కి బదులు రాజ్యా కే మంత్రి ( సహాయ మంత్రి) అని పొరబాటున చదివారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడిరది. అలా ఆ ప్రమాణాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం 15 నిమిషాలకే రాష్ట్ర మంత్రిగా మరోసారి ప్రమాణం చేశారు.