Manmohan Singh: ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలు ముగిశాయి. ఢల్లీి (Delhi) లోని నిగమ్బోధ్ ఘాట్లో ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాడె మోశారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢల్లీి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఢల్లీి ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.