Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై … సుప్రీంకోర్టులో

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ వాయిదా పడిరది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ (Speaker ) జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ తన పిటిషన్లో తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాస్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్లను ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది.
అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi )వాదనలు వినిపించారు. స్పీకర్ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని రోహత్గీ కోర్టును కోరారు. స్పీకర్ చర్చించి వివరాలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని, ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్నించింది. ముకుల్ రోహత్గీ విజ్ఞప్తితో పిటిషన్పై తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.