Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం

భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Bhushan Ramakrishna Gawai) ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, అమిత్ షా, జె.పి.నడ్డా, అర్జున్రామ్ మేఫ్ువాల్, మాజీ ఉపరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ తర్వాత సీజేఐ అయిన రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. బౌద్ధుల నుంచి ఈ పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తి ఆయనే. 1960 నవంబరు 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన ఆయన 1985లో న్యాయవాద వృతి జీవితాన్ని ప్రారంభించారు.