విప్రో బాటలో ఇన్ఫోసిస్… ఉద్యోగుల
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులందరికి అస్థిర వేతనాల్లో 30 శాతం తగ్గించనున్నట్టు ప్రకటించిది. ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో సిబ్బందికి సగటున 70 శాతం వేరియబుల్ పే ఇస్తామని ఐటీ కంపెనీ పేర్కొంది. జూన్ 2022 క్వార్టర్లో సగటు వేరియబుల్ చెల్లింపుల్లో కంపెనీ 30 శాతం కోత విధించింది. వేతన పెంపు వంటి ఉద్యోగుల వ్యయాలు పెరగడం, నూతన నియామకాలకు పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తుండటంతో వేరియబుల్ పేలో కోత విధించాల్సి వచ్చిందని ఇన్ఫోసిస్ చెప్పుకొచ్చింది. వేరియబుల్ పేలో సగటున 70 శాతం చెల్లిస్తామని అయితే తుది వేరియబుల్ పే ఆయా డిపార్ట్మెంట్ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆగస్ట్ వేతనంతో కలిపి వేరియబుల్ పే చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది.






