Indigo: ఇండిగో కీలక ప్రకటన .. మే 10 వరకు 165కి పైగా

పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor ) పేరుతో పాకిస్థాన్ (Pakistan), పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడిరది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత గగనతలంలో కొంత మేర కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. మే 10వ తేదీ వరకు 165కు పైగా విమానాల (Airplanes) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్ (Amritsar), బికనేర్, చండీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, జోధ్పుర్, కిషన్గఢ్, లేప్ా, రాజ్కోట్, శ్రీనగర్ సహా పలు ఎయిర్పోర్టుల నుంచి మే 10వ తేదీ ఉదయం 5:30 గంటల వరకు 165కి పైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాం అని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడిరచింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్డేట్లను చూసుకోవాలని తెలిపంది. ఆయా విమాన ప్రయాణికులు రీషెడ్యూల్ (Reschedule) లేదా టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడిరచింది. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ కూడా ఇస్తామని పేర్కొంది.