Ayodhya: అయోధ్యను సందర్శించిన ఎలాన్ మస్క్ తండ్రి

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తండ్రి ఎరోల్ మస్క్ (Errol Musk) భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) నగరానికి వెళ్లారు. అక్కడ నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని (Rama Mandir) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం (India) ఓ అద్భుతమైన ప్రదేశం అని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు ప్రేమ, దయ కలిగిన వ్యక్తులు అని అన్నారు.