సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు .. వారి గొంతు ఎప్పటికీ మర్చిపోలేను

ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో వచ్చే వార్తలు వింటూ తాను పెరిగానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ( సీజేఐ) అన్నారు. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో భాగంగా సీజేఐ తాజాగా ఆల్ ఇండియా రేడియోతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆకావశాణిలో ప్రజెంటర్గా తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. ఆల్ ఇండియా రేడియో తో నా అనుబంధం చాలా ఏళ్ల కిందటే మొదలైంది. అప్పట్లో మా అమ్మానాన్నలతో కలిసి ఆకాశవాణిలో వచ్చే వార్తల బులిటెన్లను వింటూ నా బాల్యం గడిచింది. ఆకాశవాణి ఈ రోజు వార్తలు చదువుతున్నది అంటూ ప్రముఖ న్యూస్ ప్రజెంటర్లు దేవకీ నందన్ పాండే, పమీలా సింగ్, లోతికా రత్నం లాంటి వారు చెబుతుంటే అలా వింటూ ఉండేవాణ్ని. వారి గొంతూ ఎప్పటికీ మర్చిపోలేను అని చంద్రచూడ్ తెలిపారు.