Obama: మన్మోహన్ ప్రతిభ అసాధారణం : అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా

సరికొత్త ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశ, దశ చూపిన ప్రధానిగా మన్మోహన్ సింగ్ (Manmohan Singh )ను ఈ చరిత్ర ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది. ఇక ఆయన హయాంలో అమెరికాతో జరిగిన అణుఒప్పందం పెను సంచలనమే. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi ) సహా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చాని దానిపై ఆయన ధైర్యంగా ముందుకెళ్లారు. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా 2008లో అగ్రరాజ్యంతో అణుఒప్పందం చేసుకున్నారు. అందుకేనేమో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఈయనంటే ప్రత్యేక అభిమానం.
ఈ ఒప్పందం కుదిరిన రెండేళ్ల తర్వాత కెనడా (Canada)లోని టొరంటో వేదికగా జీ20 సదస్సు జరిగింది. ఈ సంద్భంగా ఒబామా మాట్లాడుతూ మన్మోహన్పై ప్రశంసలు కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేశారని ఈ వేదికపై నుంచి నేను బలంగా చెబుతున్నా అని ప్రశంసించారు. ఆ తర్వాత తాను రాసిన ఎ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలోనూ మన్మోహన్ గురించి ఒబామా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అసాధారణ ప్రతిభ కలిగిన నిజాయతీపరుడు అని అభివర్ణించారు. భారత ప్రజల శ్రేయస్సు ఆర్థిక సంస్కరణల కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు. తెలివైన, ఆలోచనాత్మకమైన, కపటం లేని నిజాయతీతో కూడిన వ్యక్తిత్వం వన్మోహన్ సొంతమని కొనియాడారు.