ఉద్యోగులకు ఎయిరిండియా శుభవార్త
ఉద్యోగులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. టాటా గ్రూపులో భాగమైన ఎయిరిండియా సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగలకు కోవిడ్ 19 ముందున్న శాలరీలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. జీత భత్యాలతో పాటు ఉద్యోగుల తొలగింపు, అలవెన్సులు, భోజన సౌకర్యాలన్నింటిని సమరిస్తున్నట్లు చెప్పింది. కరోనా మహమ్మారి విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో కొన్ని ఏవియేషన్ సంస్థలు నష్టాలతో దివాళా తీశాయి. మరిన్ని సంస్థలు ఛార్జీల్ని పెంచాయి.
ఉద్యోగులకు చెల్లించే జీతాలతో పాటు ఇతర సౌకర్యాల్ని పూర్తిగా తగ్గించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా ఉద్యోగులకు చెల్లించే జీతాల్ని పునరుద్దరిస్తూ ప్రయత్నాల్ని ముమ్మం చేసింది. విమానయాన రంగం కోవిడ్ ముందు స్థాయికి చేరుకుంటుంది. అందుకే తగ్గించిన ఉద్యోగుల శాలరీలను పెంచే అంశం సమీక్షలు జరపడం సంతోషంగా ఉందని ఎయిరిండియా చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులో వచ్చాయి.






