స్టాలిన్ క్యాబినెట్ లో తెలుగువారికి స్థానం….

తమిళనాడులో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్లో 34 మంది చోటు కల్పించారు. వీరిలో ఐదుగురు తెలుగు వారు ఉండటం గమనార్హం. కేకేఎస్ రామచంద్రన్- అరుప్పు కొట్టై ఎమ్మెల్యే (రెవెన్యూ శాఖ), ఏ వేలు- తిరువణ్ణామలై నియోజకవర్గం(పీడబ్ల్యూడీ శాఖ), ఆర్ గాంధీ-రాణిపేట నియోజకవర్గం (టెక్స్ టైల్ శాఖ మంత్రి), పీకే శేఖర్ బాబు చెన్నైదురైముగం నియోజకవర్గం (దేవాదాయశాఖ మంత్రి), కేఎన్ నెహ్రూ- తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం (మున్సిపల్ శాఖ మంత్రి)గా నియమితులయ్యారు.
తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల నుంచి గెలుపొందారు. గత ప్రభుత్వాల్లోనూ తెలుగువారికి క్యాబినెట్లో ప్రాతినిధ్యాన్ని కల్పించారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ కూడా అదే బాటలో వెళ్లారు.