TRF:అమెరికా కీలక నిర్ణయం.. స్వాగతించిన భారత్

పహల్గాం దాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పహల్గాం ఉగ్ర దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ (TRF) ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ (Trump) ఆదేశాల మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు విదేశాంగ మంత్రి మార్కొ రుబియో (Marco Rubio) ఒక ప్రకటన చేశారు. టీఆర్ఎఫ్ను లష్కరే తాయిబా (Lashkar-e-Taiba)పై ఆధారపడిన దుష్ట సంస్థగా ఆయన పిలిచారు. పహల్గాం దాడి ఘటనలో న్యాయం జరగాలని ట్రంప్ కోరారని రుబియో గుర్తు చేశారు. తాజా పరిణామాన్ని భారత్ స్వాగతించింది. టీఆర్ఎఫ్పై ఉగ్ర ముద్రను సరైన సమయంలో వేసిన కీలక ముందడుగుగా అభివర్ణించింది.