భారత్-యూఏఈ మధ్య 4 కీలక ఒప్పందాలు.. యువరాజుతో మోదీ చర్చలు
అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)కి భారత్ సహకారం అందించనుంది. యూఏఈతో పాటు, అరేబియా ద్వీపకల్పంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం అయిన బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ, ఆపరేషన్స్కు ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ (ఈఎన్ఈసీ)కి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) సహకరించనుంది. ఢిల్లీలో యూఏఈ యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈఎన్ఈసీ, ఎన్పీసీఐఎల్ ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.
అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు అబుధాబి జాతీయ చమురు కంపెనీ( ఏడీఎన్వోసీ)తో భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సంస్థ (ఐఎస్పీఆర్ఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. అబుధాబి ఆన్షోర్ బ్లాక్-1కు సంబంధించి ఉర్జా భారత్ ఏడీఎన్వోసీ మధ్య భారత్లో ఫుడ్పార్క్ల అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వానికి, అబుధాబి డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్జీ (ఏడీక్యూ)తో ఒప్పందాలు జరిగాయి.






