అభివృద్ధి చెందుతోన్న దేశాలకు.. సింగపూర్ ఓ స్ఫూర్తి : మోదీ
అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఓ నమూనా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ కూడా స్వయంగా అనేక సింగ్పూర్ లను సృష్టించాలనుకుంటోందన్నారు. ఇది కేవలం భాగస్వామ్య దేశం కాదని, అభివృద్ధి చెందుతోన్న దేశాలకు సింగపూర్ ఓ స్ఫూర్తి అని అభివర్ణించారు. భారత్లో అనేక సింగపూర్లను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని సాధించేందుకు మనం సహకరించుకోవడం సంతోషంగా ఉంది. మంత్రుల స్థాయిలో నిర్వహించిన చర్యలు ఇందుకు ఓ మార్గనిర్దేశం అవుతాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానిగా లారెన్స్ బాధ్యతలు చేపట్టిన తొలిసారి భేటీ అయ్యామని గుర్తుచేసిన మోదీ, యువ నాయకత్వంలో సింగపూర్ మరింత పురోగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. నైపుణ్య శిక్షణ, డిజిటలైజేషన్, మొబిలిటీ, తయారీ, సెమీకండక్టర్లు, ఏఐ, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సహకరించుకోవడంపై ఇరువురు చర్చించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.






