మోదీ కీలక ప్రకటన.. భారత్-బ్రూనై మధ్య త్వరలోనే
బ్రూనై పర్యటన సందర్భంగా ఆ దేశ సుల్తాన్ హజీ హసనల్ బోల్కియాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ సహకారం వంటి ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి చైన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






