Modi : ఫ్రాన్స్లో భారత నూతన కాన్సులేట్ను ప్రారంభించిన మోదీ
ఫ్రాన్స్లోని మార్సెయిల్లో భారత నూతన కాన్సులేట్ ను ప్రధాని మోదీ (Modi) ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ (Macron) సంయుక్తంగా ప్రారంభించారు. అంతకు ముందు మేక్రాన్తో కలిసి భారత అమరవీరులకు మోదీ నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధం (World War I )లో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా గతంలో ఆ దేశ ప్రభుత్వం మార్సెయిల్ (Marseille) ప్రాంతంలో యుద్ధ స్మారకం నిర్మించింది. కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ చే దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు పీఎంఓ (PMO) వెల్లడిరచింది. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపినట్లు పేర్కొంది. సాంకేతికత, రక్షణ, పౌర అణుఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.






