Olympics :1904 ఒలింపిక్స్ గోల్డ్మెడల్కు వేలంలో రూ.4.72 కోట్లు
అమెరికా గడ్డపై తొలిసారిగా సెయింట్ లూయి (Saint Louis) నగరంలో 1904లో జరిగిన ఒలింపిక్స్ (Olympics) క్రీడల బంగారు పతకం తాజా వేలంలో రూ.4.72 కోట్లు ( 5,45,371 డాలర్లు) పలికినట్లు సంబంధిత కంపెనీ వెల్లడిరచింది. ఈ పతకానికి ఓవైపున ఒలింపియాడ్, 1904 అనే అక్షరాలతో పాటు విజేతగా నిలిచిన అథ్లెట్ పూలదండ పట్టుకొన్న బొమ్మ ఉంది. మరోవైపు పురాతన గ్రీకు పురాణాల్లోని విజయ దేవత నైక్తో పాటు దేవతల రాజు అయిన జ్యూస్ బొమ్మను చిత్రించారు. 110 మీటర్ల హర్డిల్స్ పోటీల విజేత అయిన అమెరికన్ క్రీడకారుడు ఫ్రెడ్ షుల్ (Fred Schul )కు ఈ స్వర్ణపతకాన్ని ప్రదానం చేశారు. దీంతోపాటు ఇచ్చిన రిబ్బను, లెదర్ బాక్సు కూడా అలాగే ఉన్నాయి.






