Saudi Arabia : సౌదీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం
ఖనిజ భవిష్యత్తుపై సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కి తెలుగు ప్రవాసీలు ఘనంగా స్వాగతం పలికారు. రియాధ్లో ప్రవాసీలు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక అరబ్బు దేశమైన సౌదీ అరేబియా లో ఉపాధి కోసం వచ్చిన భారతీయులు ప్రత్యేకంగా తెలుగు ప్రవాసీలు వాణిజ్య, పరిశ్రమ రంగాల్లోనూ ఎదుగుతుండటం సంతోషకమరని అన్నారు. కుటుంబ సమతేంగా ఢల్లీిలోని తన ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబురాలకు భారత ప్రధాని మోదీ(Modi), కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goyal) వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా వారు తనతో మాట్లాడుతూ భారత్-సౌదీ సంబంధాల పటిష్ఠతలో తన సౌదీ పర్యటన ఎంతో కీలకమని చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో తాను పండుగ మధ్యలోనే సౌదీకి వచ్చినట్లు తెలిపారు. సౌదీలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్తో పాటు, తెలుగు కళాక్షేత్రం, తాసా, హైదరాబాద్ నగరానికి చెందిన ఇతర ప్రవాసీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






